వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రైవేటీకరణకు ఎంపిలు నో: రామ్నాయక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ప్రైవేటీకరణను చాలా మంది పార్లమెంటు సభ్యులు వ్యతిరేకిస్తున్నారనిపెట్రోలియం శాఖ మంత్రి రామ్నాయక్ అన్నారు. హిందూస్థాన్పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ల ప్రైవేటీకరణను ఆపేసి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరకూడదని వారంటున్నట్లు ఆయన తెలిపారు.
వ్యూహాత్మక ప్రాముఖ్యం దృష్ట్యా చమురు కంపెనీలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉండాలని చమురు, సహజవాయువుల మంత్రిత్వ శాఖ పార్లమెంటు సభ్యుల సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో అభిప్రాయపడినట్లు ఆయన సోమవారం తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఎంపిలు అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా వుంటే, చమురు కంపెనీల ప్రైవేటీకరణపై ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ను దాఖలు చేసింది.
Comments
Story first published: Monday, October 13, 2003, 23:53 [IST]