వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హక్కుల నేతలపై ఇళ్లపై గ్రీన్ టైగర్స్..
గుంటూరు: గ్రీన్ టైగర్స్పేరు మీద కొంత మంది గుంటూరు జిల్లా పౌరహక్కుల సంఘం నాయకుల ఇళ్లపై మంగళవారం తెల్లవారుజామున దాడి చేశారు. పోలీసులే గ్రీన్ టైగర్స్పేరు మీద ఈ దాడులు చేశారని పౌరహక్కుల నాయకులు ఆరోపిస్తున్నారు.
దాదాపు 15 మంది మంకీ క్యాప్లు ధరించి వినుకొండ, సత్తెనపల్లిలలోని పౌరహక్కుల నాయకుల ఇళ్లపై దాడులు చేశారని వారు చెప్పారు. పౌరహక్కుల నేతలు జి.యల్.యన్. మూర్తి, చంద్రశేఖర్ల ఇళ్లపై ఈ దాడులు జరిగాయని వారు చెప్పారు. మూర్తి ఇంటిలోని వస్తువులను చిందరవందర చేశారని కూడా వారన్నారు. ఇందుకు నిరసనగా వినుకొండ, సత్తెనపల్లిలలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు.
Comments
Story first published: Tuesday, October 14, 2003, 23:53 [IST]