బాబు పర్యటనకు అసాధారణ భద్రత
తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల యాత్రకు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. అసాధారణ రీతిలో భద్రతా చర్యలను చేపట్టారు. తిరుమల చుట్టుపక్కల గల అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.
ముఖ్యమంత్రి ఈ నెల 16వ తేదీన శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం తిరుమల వస్తున్నారు. ఆ రాత్రి ఆయన అక్కడే ఉంటారు. మర్నాడు ఉదయంస్వామివారిని దర్శించుకుంటారు. నక్సల్స్ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న శాసనసభ్యడు రెడ్డివారి రాజశేఖర్ రెడ్డిని ఆ తర్వాత పరామర్శిస్తారు. అదే రోజు హైదరాబాద్కు తిరిగి వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రేణిగుంట నుంచి తిరుమల వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో, ముఖ్యమంత్రి బస చేసే అతిథిగృహం వద్ద భారీగా భద్రతా సిబ్బందిని నియోగిస్తున్నారు. మఫ్టీ పోలీసులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. అనుమానితులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీపులో పర్యటించబోరని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) హైదరాబాద్లో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఓపెన్టాప్ జీపులో పర్యటిస్తారని ముందు ప్రచారం జరిగింది.