మొహాలీ టెస్టుకు గంగూలీ మిస్!
మొహాలీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరబ్ గంగూలీ బుధవారం ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఆడకపోవచ్చు. న్యూజిలాండ్లో జరిగే రెండో టెస్టులో ఆయన స్థానంలో వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
గంగూలీ ఎడమ పిరుదు పైభాగాన కురుపు పుట్టడంతో శస్త్రచికిత్స జరిగింది. అది నొప్పిగా ఉండడంతో ఆయన రెండో టెస్టులో ఆడకపోవచ్చునని సమాచారం. నొప్పి తీవ్రంగా ఉంది. రెండో టెస్టులో ఆడకపోవచ్చు అని గంగూలీ అన్నాడు. ఆయన స్థానంలో యువరాజ్ సింగ్ మొహాలీ టెస్టులో మైదానంలోకి దిగే అవకాశాలున్నాయి.
న్యూజిలాండ్ కెప్టెన్ ఫ్లెమింగ్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా బంతి ఆయన తలకు తగిలింది.ఫ్లెమింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాడు.అయినా నొప్పిగా ఉందని ఫ్లెమింగ్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఆస్టల్ గాయాల బారిన పడి రెండో టెస్టులో ఆడడం లేదు.