వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసాఫసీర్లకూ భద్రత పెంపు
విశాఖపట్నం: నక్సలైట్ల నుంచి ప్రాణాపాయం ఉన్న పోలీసు అధికారులకు భద్రతనుపెంచుతామని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్.ఆర్. సుకుమార చెప్పారు. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి బుధవారం ఇక్కడికి వచ్చిన ఆయన కొద్దిసేపువిలేకరులతో మాట్లాడారు.
పోలీసు ఉన్నతాధికారిమీనాకు ఇప్పటికే భద్రత ఉన్నదని, ఆ భద్రతనుపెంచుతామని, నక్సలైట్ల నుంచి ప్రాణాపాయం ఉన్న అధికారులందరికీ తగిన భద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. అలిపిరి వంటి సంఘటనలు పునరావృతం కాకుండా సమగ్రవిచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఛత్తీస్ఘడ్,ఒరిస్సాల సహకారంతో నక్సలైట్లను ఎదుర్కుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Wednesday, October 15, 2003, 23:53 [IST]