పటిష్టస్థితిలో కివీస్: 247/1
మొహాలి: భారత్తో జరుగుతున్న రెండో టెస్టుపై న్యూజిలాండ్ పట్టు బిగించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ పటిష్టమైన స్థితికి చేరుకుంటోంది. తొలి రోజు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్పై భాతర బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. గురువారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఒకవికెట్ మాత్రమే నష్టపోయి 247 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ ఓపెనర్లు ఇద్దరూసెంచరీలు సాధించారు. విన్సెంట్ 106 పరుగులు చేసి కుంబ్లే బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు అయ్యాడు. రిచర్డ్సన్ 106 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. పేస్ బౌలర్లు గానీ, స్పిన్నర్స్ గానీ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ను ఏ మాత్రం ఇబ్బందిపెట్టలేకపోయారు. గంగూలీ లేకపోవడంతో రాహుల్ ద్రావిడ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్నుదెబ్బ తీయడానికి ద్రావిడ్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించినా లాభం లేకపోయింది.
మొదటి మూడు ఓవర్లలో న్యూజిలాండ్ ఓపెనర్లు 23 పరుగులు చేశారు. జహీర్ వేసిన బంతిని రిచర్డ్సన్ ఫస్ట్ స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. అయితే ద్రావిడ్ దాన్ని జారవిడిచాడు. అప్పుడు రిచర్డ్సన్ స్కోర్ పది పరుగులు మాత్రమే. ఆ రకంగా భారత్ మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. మరో అవకాశాన్ని కూడా భారత్ చేజార్చుకుంది.వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ పొరపాటుతో రిచర్డ్సన్ రనౌట్ను తప్పించుకున్నాడు. మొత్తంమీద న్యూజిలాండ్ పటిష్టమైన బాటలు వేసుకుంది.