సాయుధులతో చర్చలుండవు: బాబు
హైదరాబాద్: నక్సలైట్లతో చర్చలు జరపడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయుధాలు పట్టుకుని తిరిగేవారెవ్వరితోనూ చర్చలు జరపబోమని ఆయన స్పష్టం చేశారు. హింసకుస్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన మరోసారి నక్సలైట్లకువిజ్ఞప్తి చేశారు.
తాను శాంతిని పెంపొందించాలనుకుంటున్నానని, ఇక్కడ హింసకు తావు లేదని ఆయన తిరుపతి నుంచి తిరిగి వచ్చిన అనంతరంవిలేకరులతో అన్నారు. నిరంతరం భయంతో బతికే కన్నా ఆశయం కోసం మరణించడం మంచిదని ఆయన అన్నారు. తాను ఎవరికీ వ్యతిరేకిని కానని, ఎవరిమీదా కక్ష సాధింపు ధోరణి తనకు లేదని ఆయన చెప్పారు. నక్సల్స్ సిద్ధాంతం ఆచరణ సాధ్యం కాదని ఆయన అన్నారు.
నక్సలైట్లు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతున్నారని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. శుక్రవారంఉదయం తిరుపతి నుంచి తిరిగివచ్చిన అనంతరంఆయన సచివాలయానికి వెళ్ళారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలోఆయన ప్రసంగించారు.
ప్రజాస్వామ్యంలోహింసకు తావులేదని,నక్సలైట్లు తమ పంథా మార్చుకోవాలని ఆయనఅన్నారు. తనపై నక్సలైట్లు దాడి చేసినప్రదేశాన్ని స్వయంగా పరిశీలించానని ఆయనచెప్పారు. సచివాలయానికి వచ్చిన వెంటనే అక్కడదేవాలయంలోను, మసీదులోను ప్రార్ధనలుచేశారు.