కివీస్ భారీ స్కోర్: 536/5
మొహాలి: భారత్తో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ ఐదువికెట్లు మాత్రమే కోల్పోయి 536 పరుగులు చేసింది.
భారత్పై న్యూజిలాండ్ అత్యుత్తమ స్కోరు ఇది. గురువారంవిన్సెంట్, రిజర్డ్సన్ సెంచరీలు చేయగా శుక్రవారంనాడు స్టిరిస్ వంతయింది. స్టిరిస్ 119 పరుగులు చేసి టెస్టుల్లో తన రెండోసెంచరీని నమోదు చేసుకున్నాడు. గురువారంనాడుఒకే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్ శుక్రవారంనాడు మరో నాలుగువికెట్లు కోల్పోయింది.
కుంబ్లేకు శుక్రవారంనాడు ఒకవికెట్, హర్బజన్కు రెండు వికెట్లు లభించగా, సచిన్ టెండూల్కర్ ఒకవికెట్ తీసుకున్నాడు. ఈ టెస్టులో న్యూజిలాండ్విజయం సాధించకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. డ్రా చేయగలిగినా న్యూజిలాండ్దిపైచేయి అయినట్లే. శుక్రవారం ఆట ముగిసే సమయానికి మాక్మిలన్ 58 పరుగులతో,ఆర్. హార్ట్ పది పరుగులతో క్రీజ్లో ఉన్నారు.