వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇంటిపై కాల్పులు
శ్రీనగర్ః జమ్ము-కాశ్మీర్ ముఖ్యమంత్రిముఫ్తీ మహ్మద్ సయీద్ నివాసంపై ఉగ్రవాదులు శుక్రవారం దాడిచేశారు. ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదురుగా ఉన్న ఒక భవనంనుంచి ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. కాల్పులు జరగడానికిముందు ముఖ్యమంత్రి బయటికి వెళ్ళగా ఆసమయంలో సయీద్ కుమార్తె మెహబూబాముఫ్తీ ఇంట్లోనే ఉన్నారు. ఉగ్రవాదులు జరిపినకాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎఫ్ జవాన్లు, ఒక సివిల్ ఉద్యోగిమరణించారు.
ముఖ్యమంత్రి ఇంటిమీద కాల్పులు జరిపిన అనంతరం ఉగ్రవాదులుపక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్సులో దాక్కున్నారు. వందలాది భద్రతాసిబ్బంది ఆ కాంప్లెక్సును చుట్టు ముట్టారు.ఉగ్రవాదులకు భద్రతా సిబ్బందికి మధ్యచాలా సేపు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. దిగ్బంధానికిగురైన షాపింగ్ కాంప్లెక్స్ లో చిక్కుకుపోయిన వ్యాపారులను, ఇతర జనాన్ని రక్షించడానికి భద్రతాసిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Comments
Story first published: Friday, October 17, 2003, 23:53 [IST]