వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగరేణి గని కూలి 10 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః కరీంనగర్‌ జిల్లాలోని సింగరేణికాలరీస్‌ గనిలో జరిగిన ప్రమాదంలో పదిమందిమరణించారు. గోదావరి ఖనిలోని తొమ్మిదో నెంబరు గని శుక్రవారం తెల్లవారు జామున కూలిపోవడంతో రాత్రిడ్యూటీ చేస్తున్న గని కార్మికులుబొగ్గులోకూరుకుపోయారు.కూలిన గనుల శకలాల నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శుక్రవారం సాయంత్రం వరకు ఐదు శవాలను వెలికి తీశారు. ఇంకా ఐదు మృతదేహాలను వెలికి తీయాల్సి వుంది. ఈ రాత్రికి వెలికి తీయగలమనిఅధికారులంటున్నారు.

మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆరు లక్షలరూపాయల చొప్పున ఎక్స్‌ గ్రేషియా మంజూరుచేసింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతావిషాదంతో తల్లడిల్లిపోతోంది. తమ వారిని తలుచుకుని వారు విలపించడం హృదయవిదారకంగా ఉంది. అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలువిమర్శిస్తున్నాయి. గోదావరి ఖని గనుల్లో గత ఆరు నెలల్లో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇది రెండో సారి. జూన్‌లో ఏడో నెంబర్‌ గని కూలిపోయి 17 మంది మరణించారు.

అప్పటిప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్‌ బిలాల్‌నజ్లు శుక్రవారం ఇక్కడ విచారణ నిర్వహిస్తున్నారు.ఆయన రాకకు కొన్ని గంటల ముందు మరోప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X