సెహ్వాగ్ సెంచరీ: భారత్ 203/1
మొహాలి: న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో చేసిన భారీ స్కోరుకు జవాబుగా భారత్ శనివారం ఆట ముగిసే సమయానికి ఒకవికెట్ కోల్పోయి 203 పరుగులు చేసింది. ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ను న్యూజిలాండ్ 630 పరుగులకు డిక్లేర్ చేసింది.
536 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ మరోవికెట్ కోల్పోయి 630 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కివీస్ బ్యాట్స్మెన్ శనివారం ఉదయం వేగంగా పరుగులు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కుంబ్లే వేసిన బంతినిస్వీప్ చేయబోయి హార్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 18.3 ఓవర్లలో 94 పరుగులు చేశారు. మాక్మిలన్సెంచరీ సాధించగా, విట్టోరి 48 పరుగులు చేశారు. మాక్మిలన్సెంచరీ సాధించగానే లంచ్కు ముందే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.
అనంతరం బ్యాటింగ్ భారత ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. టీవిరామ సమయానికి భారత ఓపెనర్లు ఆకాశ్ చోప్రా,వీరేంద్ర సెహ్వాగ్ వికెట్ నష్టపోకుండా 114 పరుగులు చేశారు.విట్టోరి బౌలింగ్లో చోప్రా పరుగులు చేయలేకపోయాడు.విట్టోరి వేసిన 40 బంతులను ఎదుర్కున్న చోప్రా కేవలం మూడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. చోప్రా ఆచితూచి ఆడుతుంటేసెహ్వాగ్ చెలరేగిపోయాడు. ఆకాశ్ చోప్రా 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టఫీ బౌలింగ్లో అవుటయ్యాడు. అనంతరం వచ్చిన రాహుల్ ద్రావిడ్ చాలా మందకొడిగా ఆడాడు. 56 బంతులను ఎదుర్కుని 9 పరుగులు మాత్రమే చేశాడు.సెహ్వాగ్ తన సెంచరీ పూర్తి చేశాడు. శనివారం ఆట ముగిసే సమయానికిసెహ్వాగ్ 128 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు.