వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిర్ధారణకు రాలేదు: ప్రకాశ్ సింగ్
తిరుపతి: ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి భద్రతలో వైఫల్యాపై తాను ఇంకా ఒక నిర్ధారణకు రాలేదనివిఐపిలకు కల్పించాల్సిన భద్రతపై విచారణ జరపడానికి నియమితులైన ప్రకాశ్ సింగ్ చెప్పారు. ఆయన శనివారం తిరుపతిలో తన దర్యాప్తును ప్రారంభించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై దాడి జరిగిన అలిపిరిని ఆయన పరిశీలించారు. స్థానిక ఫోరెన్సిక్ లాబొరేటరీ అధికారులతో సమావేశమయ్యారు. చంద్రబాబు వాడిన బుల్లెట్ ప్రూఫ్ కారును ఆయన పరిశీలించారు. చంద్రబాబు ఆ రోజు పర్యటించిన స్థలాలను చూశారు. తన దర్యాప్తు ఇంకా ప్రారంభంలోనే ఉన్నదని ఆయనవిలేకరులతో చెప్పారు. ముఖ్యమంత్రికి, ఇతరవిఐపిలకు కల్పించాల్సిన భద్రతపై తాను అధ్యయనం చేసి సూచనలు చేస్తానని ఆయన చెప్పారు. రెండు నెలల లోగా తాను నివేదక సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Saturday, October 18, 2003, 23:53 [IST]