వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కో.బెల్ట్ ఏరియాలో కార్మికుల బంద్
కరీంనగర్: సింగరేణి ప్రాంతంలో వరుసగా జరుగతోన్న బొగ్గుగనుల ప్రమాదాలను నివారించడంలో అధికారుల వైఫల్యాన్ని నిరసిస్తూ కోల్ట్ బెల్ట్ ఏరియాలో కార్మికులు శనివారంబంద్ ను నిర్వహించారు. బొగ్గుగనుల కార్మికులే కాకుండా, ఈ ప్రాంతంలోని వ్యాపారస్తులు, స్థానికలుస్వచ్చందంగా బంద్ లో పాల్గొన్నారు. అన్ని వాణిజ్య సముదాయాలు, షాప్ లను మూసివేశారు.
సింగరేణిలో ప్రమాదాలకు ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణం అని కార్మికులు ఆరోపిస్తున్నారు. అనేక బొగ్గుబావులు మృత్యుకూపాలుగా మారినా, వాటిలోనే తవ్వకాలు జరిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Story first published: Saturday, October 18, 2003, 23:53 [IST]