భారత్కు ఫాలో ఆన్ ముప్పు
మొహాలీ: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ ఫాలోఆన్ ముప్పులో పడింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్ ఆరువికెట్లు కోల్పోయి 390 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్ను 630 పరుగులకు డిక్లేర్ చేసినవిషయం తెలిసిందే.
ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత బ్యాట్స్మెన్ లక్ష్మణ్ 86 పరుగులతో, కుంబ్లే ఒక పరుగుతోను క్రీజ్లో ఉన్నారు. 203 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన భారత్ ఆదివారం ఐదు వికెట్లు కోల్పోయింది. శనివారంనాడు ఒక వికెట్ను మాత్రమే కోల్పోపయింది. ఆదివారంనాడు రాహుల్ ద్రావిడ్ 13 పరుగులకు, వీరేంద్ర సెహ్వాగ్ 130 పరుగులు చేసి అవుటయ్యారు. సచిన్ టెండూల్కర్ మాత్రమే ఆదివారం కాస్తా నిలదొక్కుకున్నాడు. అతను 175 బంతులను ఎదుర్కుని 55 పరుగులు చేశాడు.
లక్ష్మణ్ ఆచితూచి ఆడుతున్నాడు. గంగూలీ స్థానంలో వచ్చిన యువరాజ్ సింగ్ ఫెయిలయ్యాడు. కేవలం 20 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. పార్థివ్ పటేల్ కూడా 18 పరుగులకే చేతులెత్తేశాడు. టఫీకి ఆదివారంనాడు మరో వికెట్ లభించింది. డేనియల్ విట్టోరి రెండు వికెట్లు తీసుకున్నాడు.