పంచాయతీలపై బాబు, వైస్ల హామీ
హైదరాబాద్: గ్రామపంచాయతీలకు అధికారాలు, నిధులు బదలాయించడానికి ప్రభుత్వ, ప్రతిపక్షాలుఅంగీకరించాయి. గ్రామ పంచాయతీలకు అధికారాలు, నిధులు బదలాయించాలని కోరుతూ కోటి మంది సంతకాలతో లోక్సత్తా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ప్రతిపక్ష నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఒక వినతిపత్రం సమర్పించింది.
లోక్సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్, తదితరులు ఆదివారంనాడు వారిద్దరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గ్రామ పంచాయతీలకు అధికారాలు, నిధులు బదలాయించడానికి మంత్రివర్గ ఉపసంఘంఅంచెలంచెలుగా చర్యలు తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లోక్సత్తా ప్రతినిధులకు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈవిషయమై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. గ్రామస్వరాజ్యం కోసం లోక్సత్తా కోటి సంతకాలు సేకరించింది.
ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానులు, రాష్ట్రపతుల కన్నా ప్రజలుపెద్దవాళ్లని, వాళ్లందరూ ప్రజల సేవకులేనని లోక్సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రజాప్రతినిధులు సక్రమంగా వ్యవహరించకపోతే ప్రజలు రాజ్యాంగ బద్దంగా తగిన నిర్ణయం ప్రకటిస్తారని ఆయన అన్నారు.