వేర్వేరు చోట్ల ఇద్దరు నక్సల్స్ హతం
హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులతో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు. ఒక ఎన్కౌంటర్ నిజామాబాద్ జిల్లాలో జరగగా, మరోటి వరంగల్ జిల్లాలో జరిగింది.
నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఎన్కౌంటర్లో కరీం అలియాస్ శ్రీను అనే పీపుల్స్వార్ నక్సలైట్ నాయకుడు హతమయ్యాడు. అతను ఇటీవల ఒక ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు. వరంగల్ జిల్లా అక్కంపేట వద్ద ఎస్ఆర్ఎస్పి కాలువ వ్ద జరిగిన మరో ఎన్కౌంటర్లో పీపుల్స్వార్ నర్సంపేట దళ సభ్యుడు మరణించాడు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరికి ముగ్గురు నక్సలైట్లు తారసపడ్డారు. పోలీసులను చూడగానే వారు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మరణించాడు. మరో ఇద్దరు పారిపోయారు.