వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోప్వే ప్రమాదం: నలుగురు మృతి
సిలిగురి: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో సింగమేరి, తుక్వేర్ల మధ్య ప్రయాణిస్తున్న రోప్వే ప్రమాదంలో నలుగురు టూరిస్టులు మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. రోప్వే కార్లు కేబుల్ నుంచి విడిపోయి పడిపోవడంతో ఆ ప్రమాదం సంభవించింది.
మరణించినవారిలో ముగ్గురు మహిళలు, ఒక పాప ఉన్నారు. ఎనిమిది నుంచి పది మంది ప్రయాణికులు గల మరో రెండు రోప్వే కార్లు మొదటి, రెండవ స్థూపాల మధ్య గాలిలో వేలాడాయి. వీటిని కిందికి దించి ప్రయాణికులను కాపాడారు. రోప్వే అధికారులు వాటిని సురక్షితంగా కిందికి దింపగలిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
Story first published: Sunday, October 19, 2003, 23:53 [IST]