వన్డేల్లో గంగూలీ స్థానంలో బదాని
మొహాలి: ముక్కోణపు అంతర్జాతీయ క్రికెట్ వన్డే సిరీస్ మొదటి రెండు మ్యాచ్లలో భారత కెప్టెన్ సౌరబ్ గంగూలీ ఆడడం లేదు. గంగూలీ స్థానంలో ఈ రెండు మ్యాచ్లకు హేమంగ్ బదానిని ఎంపిక చేశారు. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల ముక్కోణపు అంతర్జాతీయ వన్డే సిరీస్ గురువారం ప్రారంభం కానుంది.
మొదటి రెండు మ్యాచ్లలో గంగూలీ ఆడబోడని, గంగూలీ స్థానంలో హేమంగ్ బదాని వస్తాడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) కార్యదర్శి ఎస్.కె. నాయర్ సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గంగూలీ లేకపోవడం వల్ల జట్టుకు వైస్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నాయకత్వం వహిస్తాడని ఆయన తెలిపారు. ఎడమ తొడకు జరిగిన రెండు చిన్న శస్త్రచికిత్సల వల్ల గంగూలీ మొదటి రెండు వన్డేలకు దూరం కావాల్సి వస్తోంది.
తొలి మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ల మధ్య గురువారం చెన్నైలో జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన రెండో వన్డేలో భారత్ గ్వాలియర్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.