వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇద్దరు మృతి, 57 మందికి గాయాలు
శ్రీనగర్: ఒకటిన్నర గంటల వ్యవధిలోమిలిటెంట్లు కాశ్మీర్ లోయలో రద్దీగా ఉన్న రెండు చోట్లమిలిటెంట్లు గ్రెనేడ్స్ వేశారు. దీంతో ఇద్దరు పౌరులు మరణించగా, 57 మంది గాయపడ్డారు.
సెంట్రల్ శ్రీనగర్లోని బట్మాలూలో గల సరిహద్దు భద్రతా బలగాల పికెట్పై మిలిటెంట్లు గ్రెనేడ్ విసిరారు. అది గురి తప్పి రోడ్డుపై పడింది. దాంతో 51 మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఆర్మి జవాను కూడా ఉన్నాడు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
మరో సంఘటనలో రద్దీగా వుండే అనంతనాగ్ జిల్లాలోని లాల్ చౌక్లో రోడ్డుపై వెళ్తున్న భద్రతా బలగాల వాహనంపై గ్రెనేడ్ విసిరారు. ఈ గ్రెనేడ్ గురి తప్పి రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా ఏడుగురు గాయపడ్డారు.
Comments
Story first published: Monday, October 20, 2003, 23:53 [IST]