మంత్రి నితీష్కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్:రైల్వే మంత్రి నితీష్ కుమార్కు సోమవారం ఇక్కడపెద్ద ప్రమాదం తప్పింది. మంత్రి పాల్గొనాల్సిన వేదిక టెంటు కూలిపోయింది. అయితే మంత్రి రాకకు ముందే అది కూలిపోవడంతో ఈ ప్రమాదం తప్పింది.
వివరాలు ఇలా ఉన్నాయి- సికింద్రాబాద్లో ఏర్పాటయిన జాతీయ భద్రతా సమావేశం కోసం వేదికను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నితీష్ కుమార్తో పాటు మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కూడా పాల్గొనాల్సి ఉంది. వేదిక వద్దకు మంత్రులు రాకముందే వేదిక పైకప్పు కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు రైల్వే అధికారులు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రిలో చేర్చారు. పలువురు కార్మికులు కూడా గాయపడ్డారు. కుండపోత వర్షానికి ఈ టెంటు కూలినట్లు భావిస్తున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి నితీష్ కుమార్ అంతకు ముందు బేగంపేటలో కంప్యూటరైజ్డ్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ను ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రతి రోజూ నడిచే ఎక్స్ప్రెస్ రైలును కూడా ఆయన ప్రారంభించారు.