వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంటనగరాల్లో భారీ వర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః జంట నగరాల్లో సోమవారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లమీద కొన్ని చోట్ల రెండు మూడు అడుగుల ఎత్తున నీళ్ళు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగింది. సికింద్రాబాద్‌ ఎంజి రోడ్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట,అమీర్‌ పేట, శ్రీనగర్‌ కాలనీలలోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు సమీపంలో దక్షిణ కోస్తా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో దక్షిణ కోస్తాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయని వాతావరణ పరిశోధన కార్యాలయం అధికారులు చెప్పారు. దీంతో వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయని వారు చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉండడంతో వర్షాలు కురుస్తాయని వారంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X