వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారీ వర్షాలు-విశాఖలో నలుగురు మృతి
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లోనూ తెలుగు దేశంతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ రాష్ట్రశాఖ స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికలను సైతం కలిసే పోరాడాలని ఆ పార్టీ గురువారం ప్రారంభమైన రాష్ట్ర శాఖ సమాలోచనలో నిర్ణయించింది. హైదరాబాద్ శివార్లలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో ఈ సమాలోచనలు జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ సమాలోచనల కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
పార్టీకి చెందిన అగ్రనాయకులు, కార్యకర్తలు ఈభేటీలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా ఇక్కడ చర్చిస్తున్నప్పటికీ, కార్యకర్తలకు హితబోధ చేయడంపైన దృష్టి సారించారు. దేశంతో పొత్తును కొనసాగించడంపై రాష్ట్రశాఖలో మొన్నటివరకు విభేదాలున్నప్పటికీ, ఈ భేటీలోఅందరూ మిత్రుత్వం కొనసాగించాలని అభిప్రాయపడడంవిశేషం.
Comments
Story first published: Wednesday, October 22, 2003, 23:53 [IST]