వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
Posted on 27-10-03
విశాఖపట్నంఃవిశాఖపట్నానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలోబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రానున్న 24 గంటల్లోవిశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది.
ఈ వాయుగుండం మంగళవారం సాయంత్రంవిశాఖపట్నం- గోపాల్ పూర్ మధ్య తీరాన్ని దాటవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాయుడు చెప్పారు.
Comments
Story first published: Monday, October 27, 2003, 23:53 [IST]