వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి
Posted on 28-10-03
మెదక్:
మెదక్
జిల్లా
గజ్వెల్
సమీపంలో
జాతీయ
రహదారిపై
మంగళవారం
జరిగినఘోర
రోడ్డు
ప్రమాదంలో
8
మంది
మరణించారు.
ఆర్టీసి
బస్సుమీది
నుంచి
దూసుకెళ్లడంతో
ఈ
మరణాలు
సంభవించాయి.
ఈ
ప్రమాదంలో
మరికొంత
మంది
గాయపడ్డారు.
ఒంటి మాను చెక్పోస్టు వద్ద అదుపు తప్పిన ఆర్టీసి బస్సు మొదట మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోటార్ సైకిల్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు మరణించారు. అటు తర్వాత రోడ్డు పక్కన సీతాఫలాలు అమ్ముకుంటున్నవారిపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆరుగు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆ బస్సు కరీంనగర్ జిల్లా జగిత్యాల నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Story first published: Tuesday, October 28, 2003, 23:53 [IST]