వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూలో ఇద్దరు ఆర్మీ జవాన్ల బలి

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 28-10-03

జమ్ము: జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా ఖిలానిలోమిలిటెంట్లు మంగళవారం అత్యధునాతన పేలుడు పదార్థాలతో ఇద్దరు ఆర్మీ జవాన్లను బలి తీసుకున్నారు. ఈ దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఉదయం పదకొండున్నర, మధ్యాహ్నం 12 గంటల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైమిలిటెంట్లు రిమోట్‌ కంట్రోల్‌తో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడి తీవ్రతకు ఒక వాహనం తలకిందులుగా ఎగిరిపడింది. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.మిలిటెంట్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

శ్రీనగర్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బియస్‌ఎన్‌ఎల్‌) కేంద్ర కార్యాలయంపైమిలిటెంట్లు మంగళవారం గ్రెనేడ్‌ విసిరారు. ఈ సంఘటనలో పది మంది దాకా గాయపడ్డారు. గాయపడినవారిలో మహిళలు కూడా ఉన్నారు. పేలుడు సంభవించినప్పుడు కౌంటర్ల వద్దపెద్ద యెత్తున ప్రజలున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X