వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రకుసుప్రీం ధిక్కార నోటీసు
Posted on 28-10-03
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు మంగళవారం కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. హర్యానా, తమిళనాడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా సుప్రీంకోర్టు ఈ నోటీసు జారీ చేసింది.
పాఠశాలలు, కళాశాలల్లో పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు ఈ మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 25వ తేదీన కోర్టుకుహాజరై కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు చేపట్టరాదో స్పష్టం చేయాలని జస్టిస్ ఎన్. సంతోష్ హెగ్డే, జస్టిస్ బి.పి. సింగ్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది.
Story first published: Tuesday, October 28, 2003, 23:53 [IST]