వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియాలో దాడి- 14 మంది అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

Posted on 29-10-03

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోనిఉస్మానియా విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థులపై దాడిచేశారనే ఆరోపణపై పోలీసులు బుధవారం 14మంది విద్యార్థులను అరెస్టు చేశారు. అరెస్టయినవిద్యార్థులు అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి)కిచెందినవారు.

ఇద్దరు దళిత విద్యార్థులపై గోదావరి ఎహాస్టల్‌లో కొంత మంది దాడి చేశారు. ఈదాడిలో ఆ విద్యార్థులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. వీరిద్దరు తెలంగాణ రాష్ట్ర సమితిమద్దతుదారులు. దళిత విద్యార్థులపై దాడికినిరసనగా బుధవారం విద్యార్థులు తరగతులనుబహిష్కరించారు. దాడికి పాల్పడిన విద్యార్థులనుయూనివర్శిటీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్‌చేశారు. బోర్డర్స్‌, నాన్‌ బోర్డర్స్‌ మధ్య వివాదం ఈదాడికి కారణమై ఉంటాయని పోలీసులు అంటున్నారు. అయితేరాజకీయ అనుబంధత కూడా కారణమై ఉండవచ్చుననివారంటున్నారు. దళిత విద్యార్థులపై జరిగిన దాడితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఎబివిపి స్పష్టం చేసింది. తాము ఎస్‌సి, ఎస్‌టిలకు వ్యతిరేకంకాదని చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X