వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంగీత కళానిధి సెమ్మన్ గుడి అస్తమయం
Posted on 30-10-03
చెన్నైః ప్రముఖ కర్నాటక సంగీతవిద్వాంసుడు సెమ్మన్ గుడి శ్రీనివాస అయ్యర్ శుక్రవారంఉదయం ఇక్కడ మరణించారు. శ్రీనివాస అయ్యర్ తంజావూరు జిల్లాసెమ్మన్ గుడి గ్రామంలో 1908 జులై 25 నజన్మించారు. ఎనిమిదో ఏట నుంచే ఆయన కర్నాటక సంగీత అభ్యాసం ప్రారంభించారు.
ఆనాటి ప్రముఖవిద్వాంసులు గొట్టువాద్యం శాఖరామారావు, మహరాజపురంవిశ్వనాధ అయ్యర్ ఆయన గురువులు. 1926 లో తొలి సంగీత కచేరి చేసినఆయన ఆ తదుపరి సంవత్సరం పట్న ప్రవేశంచేశారు. 1948 లో ఆయనకు సంగీత కళానిధి అవార్డు లభించింది. గురువువిశ్వనాధ అయ్యర్ కు ఈ అవార్డు వచ్చిన మరుసటిసంవత్సరమే శిష్యుడికి రావడం ఆయన ప్రతిభకుతార్కాణం.
Comments
Story first published: Friday, October 31, 2003, 23:53 [IST]