వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూనియర్‌ డాక్టర్ల రాస్తారోకో,లాఠీచార్జి

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: ప్రధాని అటల్‌ బిహారీపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ లేఖాస్త్రం సంధించారు. తనను సంప్రదించకుండా తమ పార్లమెంటు సభ్యుడు సుదీప్‌ బందోపాధ్యాయను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయంపై ఆమె ప్రధాని మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇది సంప్రదాయ విరుద్ధమని, సంకీర్ణ రాజకీయాల ప్రాథమిక ధర్మానికి వ్యతిరేకమని ఆమె అన్నారు.

ఈ మేరకు ఆమె రెండు పేజీల లేఖను ప్రధానికి ఆమె ఫ్యాక్స్‌ చేశారు. దీంతో బందోపాధ్యాయను మంత్రివర్గంలో చేర్చుకోవాలనే నిర్ణయాన్ని ప్రధాని వాయిదా వేశారు. శనివారం ఉదయమే ఆమె ఢిల్లీకి వెళ్లాల్సి వుంది. అయితే తన పర్యటనను ఆమె రద్దు చేసుకున్నారు. సుదీప్‌ బందోపాధ్యాయను మంత్రి వర్గంలో చేర్చుకునేవిషయమై తనను ఏ దశలోనూ సంప్రదించలేదని, తన అనుమతి కూడా తీసుకోలేదని ఆమె ఆ లేఖలో చెప్పారు. ఈ మాటలు తాను ఎంతో బాధతో చెప్తున్నానని ఆమె అన్నారు.

మంత్రివర్గంలో ఎవరిని చేర్చుకోవాలని సూచించే నిర్ణయంతో పాటు అన్నివిషయాల్లో నిర్ణయం తీసుకనే ప్రక్రియలో సంకీర్ణంలోని ప్రతి రాజకీయ పార్టీకిస్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి ఉన్నదని ఆమె గుర్తు చేశారు. మంత్రి వర్గంలో చేర్చుకునేవారి జాబితాలోంచి బందోపాధ్యాయపేరును తొలగించాలని ప్రధాని కోరుతూ తమ పార్టీ అత్యవసర వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X