వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ విమానసర్వీసుల పునరుద్ధరణ
ఇస్లామాబాద్ఃరెండేళ్ళ విరామం తర్వాత గురువారం పాకిస్తాన్, భారత్ ల మధ్యవిమానసర్వీసుల పునరుద్ధరణ జరిగింది.పాకిస్ధాన్ అంతర్జాతీయ విమాన సర్వీసుకుచెందిన విమానం గురువారం మధ్యాహ్నంలాహోర్ నుంచి ఢిల్లీ చేరుకుంది. పిఐఎకుచెందిన కరాచి-ముంబాయి విమానసర్వీసులు రెండో తేదీనుంచి నడుస్తాయి.
రెండేళ్ల క్రితం పార్లమెంటు భవనంపైఉగ్రవాదుల దాడి తర్వాత ఉభయ దేశాల మధ్యవిమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాలు ఢిల్లీ నుంచి కరాచి, లాహోర్ లకు ఈనెల 9నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఇస్లామాబాద్లో సార్క్ సమావేశాలకు మీడియా ప్రతినిధులనుతీసుకెళ్ళేందుకు రెండో తేదీన రెండు చార్టర్డ్విమానాలను ఇండియన్ ఎయిర్ లైన్స్ నడుపుతోంది.
Comments
Story first published: Thursday, January 1, 2004, 23:53 [IST]