వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్‌ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్‌ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్‌సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.

లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవడం ఖాయమని ఆయనవిలేకరులతో అన్నారు. లోక్‌సభను రద్దు చేసేవిషయంపై ముందు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) పక్షాలతో చర్చిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎన్‌డిఎ కన్వీనర్‌ జార్జి ఫెర్నాండెజ్‌ ఇప్పటికే ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రధాని వాజ్‌పేయి ఇస్లామాబాద్‌ నుంచి తిరిగి రాగానే ఎన్‌డిఎ ఉమ్మడి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని, దీంతో ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడం పూర్తవుతుందని ఆయనవివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X