గ్రామసభలు అసాధ్యం: సిఇఒ హైదరాబాద్: బోగస్ ఓటర్ల ఏరివేతకు గ్రామసభలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సిఇఒ) ఎం. నారాయణరావు తేల్చి చెప్పారు. ఓటర్ల జాబితా సవరణపై ఆయన శుక్రవారం అఖిల పక్షాల నాయకులతో ఆయన సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. బోగస్ ఓటర్ల ఏరివేత కోసం గ్రామసభలు నిర్వహించాలని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. అది సాధ్యం కాదని నారాయణ రావు స్పష్టం చేశారు. దాంతో ప్రతిపక్షాల నాయకులు నిరసన వ్యక్తం చేసి సమావేశం నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో 15 శాతం బోగస్ ఓటర్లు నమోదైనట్లు ఆయనఅంగీకరించారు. బోగస్ ఓటర్ల ఏరివేతి కోసం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడగించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేశాయి. బోగస్ ఓటర్ల ఏరివేతపేర అసలు ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం, బిజెపిలుకోరాయి.
హైదరాబాద్: బోగస్ ఓటర్ల ఏరివేతకు గ్రామసభలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సిఇఒ) ఎం. నారాయణరావు తేల్చి చెప్పారు. ఓటర్ల జాబితా సవరణపై ఆయన శుక్రవారం అఖిల పక్షాల నాయకులతో ఆయన సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
బోగస్ ఓటర్ల ఏరివేత కోసం గ్రామసభలు నిర్వహించాలని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. అది సాధ్యం కాదని నారాయణ రావు స్పష్టం చేశారు. దాంతో ప్రతిపక్షాల నాయకులు నిరసన వ్యక్తం చేసి సమావేశం నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రంలో 15 శాతం బోగస్ ఓటర్లు నమోదైనట్లు ఆయనఅంగీకరించారు. బోగస్ ఓటర్ల ఏరివేతి కోసం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడగించాలని ప్రతపక్షాలు డిమాండ్ చేశాయి. బోగస్ ఓటర్ల ఏరివేతపేర అసలు ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం, బిజెపిలుకోరాయి.
రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు పని గట్టుకొనిపెద్దయెత్తున బోగస్ ఓటర్లను చేర్పించారని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. బోగస్ ఓటర్ల నమోదుకు నిరసనగా ప్రతిపక్షాల ఐక్యవేదిక ఈ నెల 5వ తేదీన హైదరాబాద్లో ర్యాలీ కూడా తలపెట్టింది. ఈ ర్యాలీని నిర్వహిస్తామని ప్రతిపక్షాలు ప్రకటించాయి.