వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కామ్స్‌ను బయటపెడుతున్నందుకే..: కాంగ్రెస్‌ హైదరాబాద్‌: వేల కోట్ల రూపాయల కుంభకోణాలను బయటపెడుతున్నందుననే తమను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నిరోధకులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధికె. రోశయ్య వ్యాఖ్యానించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

తాముప్రచారానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనిపై తెలుగుదేశం కమీషన్‌ వేసిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రగతి నివేదికల వెల్లడిపేరు మీద వందకోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. మద్యనిషేధం, సబ్సిడీ బియ్యం, తదితర పథకాల అమలులో అవకతవకలను తాము వెల్లడి చేస్తుండడం వల్ల తెలుగుదేశం నాయకుల ఆదాయానికి గండిపడిందని, అందువల్లనే తమను ప్రగతి నిరోధకులని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, వామపక్షాలు, తెలంగాణ రాష్ట్రసమితి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ విమర్శించింది. పుట్టపాగ రాధాకృష్ణ, శమంతకమణి శుక్రవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్‌. ఇంద్రసేనా రెడ్డి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలను వాయిదా వేయించాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వారన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా తెలుగుదేశం- బిజెపి కూటమిని ఓడించడం సాధ్యం కాదని వారన్నారు.

ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్‌ అదృశ్యమవుతుందనే ప్రకటన చేసిన బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు డిమాండ్‌ చేశారు. బలం ఉంటే ఇక్కడ స్థిరపడిన ఇతర ప్రాంతీయులకు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అనే హామీని ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని ఆయన బిజెపిని డిమాండ్‌ చేశారు. బిజెపిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X