స్కామ్స్ను బయటపెడుతున్నందుకే..: కాంగ్రెస్ హైదరాబాద్: వేల కోట్ల రూపాయల కుంభకోణాలను బయటపెడుతున్నందుననే తమను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నిరోధకులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధికె. రోశయ్య వ్యాఖ్యానించారు.
తాముప్రచారానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దీనిపై తెలుగుదేశం కమీషన్ వేసిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రగతి నివేదికల వెల్లడిపేరు మీద వందకోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. మద్యనిషేధం, సబ్సిడీ బియ్యం, తదితర పథకాల అమలులో అవకతవకలను తాము వెల్లడి చేస్తుండడం వల్ల తెలుగుదేశం నాయకుల ఆదాయానికి గండిపడిందని, అందువల్లనే తమను ప్రగతి నిరోధకులని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ అదృశ్యమవుతుందనే ప్రకటన చేసిన బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. బలం ఉంటే ఇక్కడ స్థిరపడిన ఇతర ప్రాంతీయులకు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అనే హామీని ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని ఆయన బిజెపిని డిమాండ్ చేశారు. బిజెపిని తెలంగాణ ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.