ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్పేయి ఇస్లామాబాద్ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడిఫెన్సింగ్ నిర్మాణం సమస్యను ఏకపక్షంగా పరిష్కరించడానికి చేసే ప్రయత్నం కాదని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి స్పష్టం చేశారు. మిలిటెంట్ల చొరబాట్లను నిరోధించడానికేఫెన్సింగ్ ఏర్పాటు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
నియంత్రణ రేఖ వెంబడిఫెన్సింగ్ నిర్మించి జమ్మూ కాశ్మీర్ సమస్యను తాము ఏకపక్షంగా పరిష్కరించే ప్రయత్నం చేసే ప్రసక్తి లేదని ఆయన శుక్రవారం పాకిస్థాన్ దినపత్రిక డాన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సార్క్ సదస్సులో పాల్గొనడానికి ఆయన శనివారం ఇస్లామాబాద్కు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఫెన్సింగ్ నిర్మాణం ద్వారా భారత్ అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదనేవిమర్శను ప్రస్తావించగా నియంత్రణ రేఖను భారత్ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించడం లేదని, ఈ రేఖ ఉభయ దేశాలుఇరువైపులా వాస్తవంగా నియంత్రణ కలిగి వున్నవిషయాన్ని తెలియజేస్తుందని, దీన్ని 1972 డిసెంబర్లో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాల నుంచిమినహాయించారని ఆయన వివరించారు.