వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ అంశంపై పేచీలేదు: దిగ్విజయ్
బోగస్ ఓట్ల తప్ప మరో రకంగా గెలువలేమనే భయం చంద్రబాబుకు పట్టుకున్నదని ఆయన అన్నారు. బోగస్ ఓటర్ల నమోదుకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం పని కట్టుకొని పని చేసిందని ఆయన విమర్శించారు. తమవారు తెలియక ఏదైనా తప్పు చేసి వుండవచ్చునని, దాన్ని సరిదిద్దుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పతివ్రతనా అని అన్నారంటే చంద్రబాబు కావాలనే తప్పు చేశారనేది అర్థమవుతోందని, ఉద్దేశ్యపూర్వకంగానే స్వార్థప్రయోజనం కోసం చంద్రబాబు తప్పు చేశారని ఆయన మాటలు తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగాన్ని ఇప్పటికైనా మానుకోవాలని ఆయన చంద్రబాబుకు హితవు చెప్పారు. తెలుగుదేశం- బిజెపి కూటమిని ఓడించేందుకే తాము ఇతర పార్టీలతో పొత్తులకు సిద్ధపడుతున్నామని ఆయన చెప్పారు
Story first published: Tuesday, January 6, 2004, 23:53 [IST]