వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్‌, డిఎంకె ఒక అవగాహనకు వచ్చాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ రాయబారి, సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ప్రకటించారు.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ గురువారం ఉదయం చెన్నైకి వచ్చి డిఎంకె అధినేత ఎం. కరుణానిధిని ఆయన తన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు గంట సేపు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు వంటి ఇతర అంశాలపై తర్వాత చర్చలు జరుగుతాయని కరుణానిధిని కలిసిన అనంతరం మన్మోహన్‌ సింగ్‌ విలేకరులకు చెప్పారు. స్వర్గీయ రాజీవ్‌గాంధీ హత్యకు కారణమైన ఎల్‌టిటిఇకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎండిఎంకెను కూడా మీ సంకీర్ణ కూటమిలో చేర్చుకుంటారా అని విలేకరులు అడిగితే గతంలోకి తాము వెళ్లదలుచుకోలేదని మన్మోహన్‌ సింగ్‌ సమాధానమిచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X