వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
హైదరాబాద్: అభివృద్ధి రాజకీయ ఎజెండాగా మారిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిఅరుణ్ జైట్లీ అన్నారు. ఇక్కడ ఏర్పాటైన సిఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సమావేశంలో ఆయన శుక్రవారం ప్రసంగించారు.
ప్రస్తుత ఆర్థిక ఎజెండా ప్రస్తుత రాజకీయాలను శాసించేదిగా ఉన్నదని ఆయన అన్నారు. ఇప్పుడుఅందరూ అభివృద్ధి రేటు గురించే మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. భారత్ జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ హబ్గా మారనుందని, ప్రధాన మానవ వనరుల పంపిణీలో ముందుంటుందని ఆయన అన్నారు. దేశంలో 23 ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటుకు తాము ఇటీవలే ఆమోదం తెలిపినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక ఆర్థిక జోన్లుపెరుగుదల యంత్రాలుగా పని చేస్తాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, January 9, 2004, 23:53 [IST]