వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటమి భయంతో కాంగ్రెస్‌ పొత్తులుః బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్‌: ముక్కోణపు వన్డే సరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియావిజయం సాధించింది. భారత్‌పై 18 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. టైల్‌ ఎండర్స్‌విఫలం కావడంతో భారత్‌ ఓటమి పాలు కాకతప్పలేదు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 288 పరుగులకు ఆలవుట్‌అయింది. భారత బౌలర్‌ అజిత్‌ అగార్కర్‌ ఆరు వికెట్లు తీసుకొని రవిశాస్త్రి రికార్డును బద్దలు కొట్టాడు. ఇండియా 270 పరుగులకు ఆల్‌ అవుటైంది. ఒకానొక సందర్భంలో నాలుగువికెట్లు మాత్రమే కోల్పోయి భారత్‌ 257 పరుగులు చేసివిజయాన్ని సునాయసంగా కైవసం చేసుకుంటుందనే దశలో ఉంది. 26 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన దశలో భారత్‌ బ్యాటింగ్‌ కుప్పకూలింది.

ఆల్‌ రౌండ్‌ ప్రతిభను కనబరిచిన ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఆండ్ర్యూ సిమండ్స్‌ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుఅందుకున్నాడు. 102 బంతుల్లో 88 పరుగులు చేసిన సిమండ్స్‌ సచిన్‌ టెండూల్కర్‌,వివియస్‌ లక్ష్మణ్‌ల వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియావిజయానికి దోహదం చేశాడు.

ఆస్ట్రేలియా ఓపెనర్లు మంచి ప్రారంభాన్నిఅందించారు. ఈ స్థితిలో ఆస్ట్రేలియా 350 పరుగుల దాకా చేయగలదని అనిపించింది. అయితేఅగార్కర్‌ వరుసగా వికెట్లు తీయడంతో 288 పరుగులకు కట్టడి చేయగలిగారు.

289 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఒపెనర్లలోవీరేంద్ర సెహ్వాగ్‌ మందకొడిగా ఆడాడు. వికెట్‌ను కాపాడుకోవడానికి తంటాలు పడాల్సి వచ్చింది. 59 బంతుల్లో 35 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే సచిన్‌ టెండూల్కర్‌ రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. టెండూల్కర్‌ 63 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లక్ష్మణ్‌ గానీ, ద్రావిడ్‌ గానీ నిలదొక్కుకోలేకపోయారు. గంగూలీ 84 బంతుల్లో 82 పరుగులు చేశాడు. యువరాజ్‌సింగ్‌, సంజయ్‌ బంగర్‌లు కూడా విఫలం కావడంతో భారత్‌ ఓడిపోకతప్పలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X