ఓటమి భయంతో కాంగ్రెస్ పొత్తులుః బాబు
న్యూఢిల్లీ: ఖగోళ శాస్త్రవేత్త కల్పనా చావ్లా వంటి ప్రవాస భారతీయులు భారతదేశవిలువలను అత్యున్నతంగా నిలబెట్టారని, విశ్వ పౌరులుగా ఎదగడానికి కృషి చేశారని ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి ప్రశంసించారు.
ప్రవాసి సమ్మాన్తో సత్కారాలుఅందుకున్నవారిని ఆయన ప్రశంసించారు. ద్వితీయ ప్రవాసి భారతీయ సమ్మేళన్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లోని, ఆగ్నేయాసియా దేశాల్లోని ప్రవాస భారతీయుల పిల్లలు భారతదేశంలో ఉంటే ఆ పిల్లలకువిద్యాసంస్థల్లో 15 శాతం సూపర్న్యూమరీ సీట్లలో మూడింట ఒక వంతుసీట్లు కేటాయిస్తామని ప్రధాని చెప్పారు. గల్ఫ్లోని భారతీయులు ఎన్ఆర్ఐఫీజు చెల్లించనవసరం లేదని, వారికి దేశంలోని పౌరులకు ఇచ్చే సదుపాయాలే ఇస్తామని ఆయన చెప్పారు.
యేటా వివిధ దేశాల్లో ఉన్న రెండవ లేదా మూడవ తరం యువకులను 50 మందిని దేశానికి ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. రెండు వారాల పాటు దేశాన్ని సందర్శించవచ్చునని ఆయన చెప్పారు. భారతదేశంఅంటే ఏమిటో తమ తమ దేశాల్లో వివరించాలని ఆయన భారత సంతతికి చెందిన విదేశీయులనుకోరారు.
భారత అంతర్జాతీయ వాతావరణంలో సానుకూల పవనాలువీస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రవాస భారతీయుల, భారత సంతతికి చెందినవారి సమావేశంలో ఆయన ప్రసంగించారు.