వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆజాద్తోనే అసమ్మతి అమీతుమీ
హైదరాబాద్: నకిలీ స్టాంపుల కుంభకోణంలో మరో నిందితుడ్ని హైదరాబాద్లోఅరెస్టు చేశారు. సికింద్రాబాద్లోని మారేడుపల్లి పోలీసుస్టేషన్కు చెందిన కానిస్టేబుల్ కె. పున్నమేశ్వర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందంఅరెస్టు చేసినట్లు సమాచారం. పోలీసులు ఈ అరెస్టును ధృవీకరించడం లేదు. స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాని నిందితుడైన అబ్దుల్ కరీం తెల్గీకి, పోలీసు అధికారులకు మధ్య ఇతను మధ్యవర్తిగా వ్యవహరించాడని భావిస్తున్నారు.
ఇదిలావుంటే, స్టాంపుల కుంభకోణంలోఅరెస్టయిన తెల్గీ అనుచరుడు రియాజ్ ఖాద్రీని జ్యుడిష్యల్ రిమాండ్కు పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోనిఅప్పటి బేగంబజార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టాంపుల కుంభకోణంలో సాక్షిగా తన చేత బలవంతంగా సంతకం చేయించాడని ఖాద్రీ అంటున్నాడు. స్టాంపుల కుంభకోణంలో తనకు పాత్ర లేదని అతను అంటున్నాడు.
Comments
Story first published: Friday, January 9, 2004, 23:53 [IST]