వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్తో పొత్తుకు దిగిరాం: కెసిఆర్హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం చంద్రశేఖర్ రావువిలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: లోక్సభకు ముందస్తు ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుస్వాగతించారు. లోక్సభకు, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయన సోమవారంవిలేకరులతో అన్నారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ)విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేరుతుందా అనే ప్రశ్నకు ఆయన జవాబు దాటవేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, ఉపాధి అవకాశాలుపెరిగాయని, ఈ స్థితిలో ప్రజలు ఎన్డిఎ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన అన్నారు. లోక్సభకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఇంతకు ముందే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.
Comments
Story first published: Monday, January 12, 2004, 23:53 [IST]