వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌ సభ ముందస్తుకు బిజెపి తీర్మానం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: లోక్‌సభ ముందస్తు ఎన్నికలు ఏప్రిల్‌లో లేదా మేలో జరగవచ్చునని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సూచనప్రాయంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గం ముగింపు సమావేశంలో వాజ్‌పేయి చేసిన ప్రసంగంవివరాలను పార్టీ అధికార ప్రతినిధి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ సోమవారంవిలేకరులకు చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగితే మంచిదని వాజ్‌పేయి అన్నారు. ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌పై నిర్ణయం తీసుకునే బాధ్యతను ఆర్థిక మంత్రి జస్వంత్‌ సింగ్‌కు వదిలేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోవిజయం సాధించిన తర్వాత విశ్రాంతి తీసుకుంటానని ఆయన అన్నారు.

నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి బిజెపి జాతీయ కౌన్సిల్‌ ఫిబ్రవరి 8 లేదా 10వ తేదీన సమావేశమవుతుందని ఆయన చెప్పారు. ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీని, పార్టీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడును చూసినప్పుడల్లా తాను యువకుడైపోయినట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు.

ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని బిజెపి చేసిన తీర్మానాన్ని తాను పరిగణనలోకి తీసుకున్నాని ప్రధాని అన్నారు. ఈఅంశంపై దేశమంతటా చర్చ జరుగుతోందని ఆయన అన్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) దేశానికి వాంఛనీయం, అనివార్యంఅయిందని ఆయన అన్నారు. ఎన్‌డిఎపై గతంలో జరిగిన దుష్ప్రచారమంతా మాసిపోయిందని ఆయన అన్నారు. ఎన్‌డిఎపై ప్రజలవిశ్వాసం పెరిగిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X