కాంగ్రెస్తో పొత్తుకు దిగిరాం: కెసిఆర్హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయంలో మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు చెప్పారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశం అనంతరం చంద్రశేఖర్ రావువిలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతున్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్పి) మాజీ నేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విదేశీయతపై ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి, బిజెపి అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు చేసిన ప్రకటనలకు రాజశేఖర్ రెడ్డి సోమవారంవిలేకరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు.
సోనియా గాంధీ విదేశీయతఅంశంపై సుప్రీంకోర్టు కచ్చితమైన నిర్ణయం ప్రకటించిందని,అయినా సోనియా విదేశీయత గురించి బిజెపి నాయకులు మాట్లాడడం విడ్డూరమని ఆయన అన్నారు. మహిళకువివాహమైన తర్వాత పుట్టినిల్లు వదిలి మెట్టినింటికి వస్తుందని, మెట్టినిల్లేసొంత ఇల్లవుతుందని, ఇది హిందూ సంప్రదాయమని, ఈ సంప్రదాయాన్ని కూడా బిజెపి నాయకులు కాదంటున్నారని, ఆ రకంగా వారు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. లోక్సభకు, రాష్ట్ర శాసనసభకు ఒకేసారి ఎన్నికలు రావడాన్ని ఆయన ఆహ్వానించారు. దేశంలో ఎన్డిఎ శని, రాష్ట్రంలో తెలుగుదేశం శని ఒకేసారి వదులుతాయని ఆయన వ్యాఖ్యానించారు.