వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

హోబర్ట్‌: గిల్‌గ్రిస్ట్‌ బ్యాటింగ్‌ ధాటితో ఆస్ట్రేలియా జింబాబ్వేపై శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌లోవిజయం సాధించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆసీస్‌కు జింబాబ్వేపై ఇది రెండోవిజయం. భారత్‌పై జరిగిన ఒక మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియావిజయం సాధించింది. ఇప్పటి వరకు తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆస్ట్రేలియా గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.

గిల్‌క్రిస్ట్‌ 172 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా జింబాబ్వేపై 148 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 344 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన జింబాబ్వే ఎప్పటి లాగే విఫలమైంది. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడం సర్వసాధారణం కావడం, హీత్‌స్ట్రీక్‌ ఒక్కడే మొండిగా ఆడడం సర్వసాధారణమైంది. ఇదే ఈ మ్యాచ్‌లోనూ పునరావృతమైంది. హీత్‌స్ట్రీక్‌, వికెట్‌ కీపర్‌ తైబు కలిసి ఆరో వికెట్‌ భాగస్వామ్యానికి 102 పరుగులు జోడించారు. 50 పరుగులకు మూడు ఆస్ట్రేలియా వికెట్లు పడగొట్టిన స్ట్రీక్‌ బ్యాటింగ్‌లో కూడా తన ప్రతిభను కనబరిచాడు. 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. తైబు 44 పరుగులు చేశాడు.

ప్రస్తుతం ఆస్ట్రేలియా 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. జింబాబ్వేకు ఇప్పటి వరకు ఒక్క పాయింట్‌ కూడా లభించలేదు. ఆస్ట్రేలియాతో రెండోసారి భారత్‌ ఆదివారంనాడు బ్రిస్బేన్‌లో తలపడనుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X