వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.
హోబర్ట్: గిల్గ్రిస్ట్ బ్యాటింగ్ ధాటితో ఆస్ట్రేలియా జింబాబ్వేపై శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్లోవిజయం సాధించింది. ముక్కోణపు వన్డే సిరీస్లో ఆసీస్కు జింబాబ్వేపై ఇది రెండోవిజయం. భారత్పై జరిగిన ఒక మ్యాచ్లోనూ ఆస్ట్రేలియావిజయం సాధించింది. ఇప్పటి వరకు తాను ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఆస్ట్రేలియా గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 17 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. జింబాబ్వేకు ఇప్పటి వరకు ఒక్క పాయింట్ కూడా లభించలేదు. ఆస్ట్రేలియాతో రెండోసారి భారత్ ఆదివారంనాడు బ్రిస్బేన్లో తలపడనుంది.
Comments
Story first published: Friday, January 16, 2004, 23:53 [IST]