వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ:విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం మాయమైంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే శిశువును ఎత్తుకుపోయినట్లు చెబుతన్నారు.

గుర్తు తెలియని మహిళ వార్డు నుంచి స్వరూపారాణి అనే మహిళకు జన్మించిన శిశువును ఎత్తుకుపోయింది. ఆ మహిళ కేస్‌ షీట్‌ పట్టుకుని రావడంతో తమకు అనుమానం కలగలేదని స్వరూపారాణి అంటోంది. ఆమె నీలిరంగు చీర కట్టుకుని ఉన్నదని, వార్డంతా కలియదిరిగిందని, అందువల్ల ఎదురు పడితే తాము గుర్తించగలమని వార్డులోని రోగులు అంటున్నారు. గర్భిణి అయిన ఆ మహిళ వార్డులోని పిల్లలందర్నీ ముద్దాడిందని చెబుతున్నారు. ఆ శిశువు తండ్రి డబ్బుల కోసం వూరు వెళ్లాడని స్వరూపారాణి చెబుతోంది. పిల్లలను ఎత్తుకుపోయిన సంఘటనలు గతంలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగాయి. దీంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని సిబ్బంది అంటున్నారు. శిశువు మాయానికి రోగి, రోగి కుటుంబ సభ్యులు బాధ్యులని వారంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X