వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా విదేశీయతపై బాబు ధ్వజం అనంతపురం: కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడువిమర్శించారు. తెలుగుదేశం అనంతపురం జిల్లా ప్రజా సదస్సులో ఆయన బుధవారం ప్రసంగించారు. పనికి ఆహారం పథకానికి అడ్డుపడ్డారని, జన్మభూమికి అడ్డుపడే ప్రయత్నం చేశారని, తాను చేసే ప్రతి మంచిపనికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌, ఎన్‌సిపిల మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉంది. పొత్తుపెట్టుకునేందుకు అవసరమైన పద్ధతిని రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు.

సమావేశం ఫలితం సాధించిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పవార్‌తో 40 నిమిషాల పాటు సంభాషణ జరిపిన అనంతరం విలేకరులతో అన్నారు. తమ చర్చ ప్రధానంగా రాబోయే ఎన్నికలపై, ప్రజల ముందు ప్రత్యామ్నాయాన్ని ఉంచే విషయంపై జరిగిందని ఆమె అన్నారు. కాంగ్రెస్‌, ఎన్‌సిపిలు ఉమ్మడిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడే ప్రక్రియ ప్రారంభమైందని శరద్‌పవార్‌ చెప్పారు. భావసారూప్య పార్టీలు మరిన్ని ఈ ఉమ్మడి ప్రక్రియలో పాలు పంచుకోగలవనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఇరు పార్టీల మధ్య పొత్తుకు ఉన్న అభ్యంతరకరమైన అంశాలపై మాట్లాడడానికి ఇరువురు నేతలు తిరస్కరించారు. సోనియా గాంధీ విదేశీసంతతి అంశంపై పవార్‌ మాట్లాడడానికి నిరాకరించారు. ఈ అభ్యంతరకరమైన అంశాల గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు- రాజకీయ పార్టీల మధ్య విభేదించే అంశాలు పలు ఉంటాయని, ఒక దగ్గర కూర్చోవాలనుకున్నప్పుడు కొన్ని అంశాలను పక్కన పెట్టాల్సి వుంటుందని శరద్‌పవార్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X