వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్పేయి ఇస్లామాబాద్ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.
నాగపూర్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ చెప్పారు. ములాయం సింగ్ నాయకత్వంలోని సమాజ్వాదీ పార్టీతో గానీ, మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీతో గానీ తమకు పొత్తు ఉండదని ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
Comments
Story first published: Sunday, January 18, 2004, 23:53 [IST]