ముందస్తు ఎన్నికలకు పోతాం: అద్వానీ తిరుపతి: ప్రధాని వాజ్పేయి ఇస్లామాబాద్ నుంచి తిరిగి రాగానే ముందస్తు లోక్సభ ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ చెప్పారు. ఆయన శుక్రవారం సతీసమేతంగా తిరుమలను సందర్శించారు. ముందు పద్మావతి అమ్మవారిని సందర్శించుకుని తిరుమల చేరుకున్నారు.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుతవిజయం సాధించింది. ఆస్ట్రేలియాను 19 పరుగులతో భారత్ ఓడించింది. అన్నివిషయాల్లో ఉత్తమమైన ప్రదర్శనను భారత్ ఆదివారంనాడు కనబరిచింది.
ఈ మ్యాచ్లో సెహ్వాగ్ లేకపోవడంతో సచిన్ టెండూల్కర్తో కలిసి కెప్టెన్ సౌరబ్ గంగూలీ భారత బ్యాటింగ్ను ప్రారంభించాడు. అయితే గంగూలీ ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాడు. సచిన్ తన ప్రతిభనుఅంతా కనబరిచి ఆడాడు. టెండూల్కర్ 86 పరుగులు చేసి అవుటయ్యాడు.వివియస్ లక్ష్మణ్తో కలిసి తన భాగస్వామ్యంలో సచిన్ వంద పరుగులకుపైగా జోడించాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన రాహుల్ ద్రావిడ్ ఆచితూచి ఆడుతూనే వేగంగా పరుగులు చేశాడు. లక్ష్మణ్సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. భారత్ నాలుగువికెట్లు మాత్రమే కోల్పోయి 303 పరుగులు చేసింది. 103 పరుగులు చేసి భారత్విజయానికి తోడ్పడిన లక్ష్మణ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ ఈ మ్యాచ్లో పూర్తిటీమ్ స్పిరిట్ను ప్రదర్శించింది. భారత ఆటగాళ్లు కొన్ని అద్భుతమైన క్యాచ్లు పట్టారు.