వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్
నిజామాబాద్: తమ హయాంలోనే రాష్ట్రంలో కనివినీ ఎరుగని అభివృద్ధి జరిగిందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మంగళవారంనాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నిజామాబాద్ పాలెం గ్రామం వద్దశ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు.
శ్రీరాంసాగర్ వరద కాలువ ప్రాజెక్టుజూన్ నెలకు పూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల భూములకు నీరందుతుందని ఆయన చెప్పారు. తమ హయాంలో ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే కొన్ని ప్రాంతాలు వెనకబడ్డాయని ఆయన అన్నారు.
Story first published: Tuesday, January 20, 2004, 23:53 [IST]