వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటర్ల జాబితాలపై ఇసి సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు లౌకిక పార్టీలన్నీ ఏకం కావాలని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిజ్ఞప్తి చేశారు. విజయవాడలో జరిగిన మహిళల ప్రాంతీయ సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు.

తెలుగుదేశం పార్టీని ఓడించడానికి వామపక్షాలతో సహా అన్ని లౌకిక పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. మాయం మాటలు చెబుతూ మోసంచేయాలని చూస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలకు, బెల్ట్‌ షాపులకు ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చి, వాటి ద్వారా వచ్చిన ముడుపులతో చంద్రబాబు జేబులు నింపుకుంటున్నారని, అలా ముడుపులు తీసుకుంటున్న బిగ్‌బాస్‌ చంద్రబాబేనని ఆయన అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కనీవినీ ఎరుగని రీతిలో రైతులు, మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన చెప్పారు. మహిళా సాధికారిత, ఉపాధిపెరుగుదల రేటు తగ్గాయని ఆయన అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్కరణలపేరుతో చంద్రబాబు సామాన్యుల గొంతు కోస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులువిమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X